APP: రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే బాధలో వేర్వేరు చోట ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్టియర్లో ఫెయిలవ్వడంతో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో చిన్నమస్తాన్, నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ కొండపేటకు చెందిన చరణ్తేజ్కు సెకండియర్ ఫిజిక్స్లో 10 మార్కులే వచ్చాయి. దాంతో చరణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.