తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్
నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివిల్స్ శిక్షణకు మార్గదర్శకత్వం చేస్తామంటూ కొందరు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్లలో ఖాతాలు తెరిచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.