ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రంలో రైతుల ఆందోళన

31452చూసినవారు
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండంలోని కనుముక్కల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం వద్దే తడిచిన ధాన్యం బస్తాలతో రైతులు ధర్నాకు దిగారు. తడిచిన ధాన్యం కొనుగోలుపై తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్