తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేడు ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో పవర్ కట్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్లో పవర్ కట్ వల్ల ఇంకా పోలింగ్ ప్రారంభంకాలేదని సమాచారం. రాత్రి నుంచి అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు APలోని అనంతపురం (D)రాయదుర్గంలో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. భారీ వర్షం, పవర్ కట్తో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.