బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్నాలో ఓ క్రేన్ను ఆటో ఢీ కొట్టడంతో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పట్నాలోని రామ్లఖన్ పాత్ ప్రాంతంలో మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగమైన ఓ భారీ క్రేన్ను ఆటో అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.