గాంధీ ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

50చూసినవారు
గాంధీ ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు
దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా గాంధీ ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు చెలరేగాయి. అస్సాంలోని బొంగైగావ్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రైల్లో కొన్ని బోగీలకు మాత్రమే మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం లేదని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి మెకానికల్‌ సమస్యలే కారణమని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్