అదుపులోకి మంటలు: కలెక్టర్ క్రాంతి

553చూసినవారు
అదుపులోకి మంటలు: కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ కెమికల్స్ కార్మాగారం రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు 90 శాతం వరకు అదుపులోకి వచ్చినట్లు ఆ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలంలో ఉండి మంటలు ఆర్పే పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులైన సుమారు 25 నుండి 30 మందిని ఎమ్మెన్నార్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్