ఆర్‌జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం (వీడియో)

82చూసినవారు
బీహార్‌లోని ముంగేర్‌లో గురువారం దారుణ ఘటన జరిగింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌ మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పంకజ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్