గోధుమల్లో ఊక(పైపొట్టు), బ్రాన్(పైపొరతో), పాలిష్డ్ అని 3 దశలుంటాయి. పైపొర తీసేసి గోధుమలను మెత్తగా చేస్తే దాన్ని మైదా అంటారు. అయితే గోధుమ రవ్వకు, మైదాకు పెద్ద తేడా లేదని పీడియాట్రీషియన్స్, న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మైదా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటూనే.. ఇంటర్నెట్లో చూపించేంత భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు, అధిక బరువున్న మహిళలు తినకూడదట.