పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు ఆలస్యం

53చూసినవారు
పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు ఆలస్యం
ఢిల్లీని చలి వణికిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఢిల్లీలో రాబోయే రెండు రోజులు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేగాకుండా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్