జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీలో నిలిచిన ఆయన ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మోదీ 3.0 కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా త్వరలో రామనగర అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.