బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్కు జడ్జి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రజాభవన్ ముందు బారికేడ్ను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రహీల్ను పోలీసులు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.