AP: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. నిల్వ ఉంచిన వ్యవసాయ సామగ్రికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. డ్రిప్, స్ప్రింక్లర్లు, పైపులకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది