కేంద్ర హోం మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో గుజరాత్ పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఆప్, ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.. సోమవారం అస్సాం పోలీసులు గౌహతి హైకోర్టులో లాయర్ రీతమ్ సింగ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రీతం సింగ్ కాంగ్రెస్ అస్సాం వార్ రూమ్లో కోఆర్డినేటర్గానూ పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.