ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వతారోహకులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ట్రెక్కర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.