చేతబడి నెపంతో 11 నెలల చిన్నారి స‌హా న‌లుగురి దారుణ హ‌త్య‌

84చూసినవారు
చేతబడి నెపంతో 11 నెలల చిన్నారి స‌హా న‌లుగురి దారుణ హ‌త్య‌
ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్ జిల్లా కస్డోల్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో రామ్‌నాథ్ పాట్లే అనే వ్యక్తి కుమార్తె నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. కూతురిపై పక్కింటి వ్యక్తి చేతబడి చేశాడని అనుమానంతో గురువారం పొరుగున ఉన్న‌ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై పాట్లే కుటుంబం గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుల్లో ఇద్దరు మ‌హిళ‌లు, పురుషుడు, 11 నెలల చిన్నారి ఉన్నారు. నిందితులు రామ్‌నాథ్ పాట్లే, అతని ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్