దంచికొడుతున్న ఎండ‌లు.. కేర‌ళ‌లో న‌లుగురు ఓట‌ర్లు మృతి

63చూసినవారు
దంచికొడుతున్న ఎండ‌లు.. కేర‌ళ‌లో న‌లుగురు ఓట‌ర్లు మృతి
కేర‌ళ‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవాళ అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఓట‌ర్లు ఆప‌సోపాలు ప‌డుతూ పోలింగ్ బూత్‌ల‌కు చేరుకుంటున్నారు. కేర‌ళ‌లో హీట్‌వేవ్ ఎక్కువ‌గా ఉన్న‌ది. పాలక్కాడ్‌, మ‌ల‌ప్పురం, అల‌ప్పుజా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు ఓట‌ర్లు మృతిచెందారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. బెంగుళూరులో కూడా హీట్‌వేవ్ లాంటి ప‌రిస్థితులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్