సీఎం జగన్ చెల్లెలు, వైఎస్ షర్మిల ఒక పార్టీలో ఉన్నారని.. ఆ పార్టీ ప్రకారమే మాట్లాడుతున్నారని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. "విమర్శలు చేసేటప్పుడు షర్మిల సంయమనం పాటించాలి. నిన్నటి వరకు చెల్లి.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి?" అని బోత్స వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.