సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హర్షద్ తోప్కర్ అనే వ్యక్తి డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వరకూ వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించాడు. ఆ సమయంలో అతనికి రైలులో భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగులో ఫంగస్ కనిపించింది. దీంతో అతడు వెంటనే ఫొటోలు తీసి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అతని పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.