గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు

562చూసినవారు
గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి గుమ్మనూరు జయరాం మంగళవారం వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను 2019 నుంచి 2022 వరకు జీసస్, అల్లాగా చూశానని అన్నారు. 2022 తర్వాత జగన్ గుడిలో శిల్పంగా మారారని, ఆ శిల్పానికి ఇద్దరు పూజారులు ఉన్నారన్నారు. వారు ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు. ఆ ఇద్దరు పూజారులు శిల్పం వెనకాల వాయిస్ ఇస్తుంటారని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్