నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో జూలై 16, 17, 18 తేదీల్లో జరిగే లొద్ది మల్లయ్య జాతరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అటవీశాఖ అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు లొద్ది మల్లయ్య జాతరకు అనుమతులు ఇస్తామని తెలిపారు.