గద్వాల: హైదరాబాద్ కు బయలుదేరిన ఉపాధ్యాయ అభ్యర్థులు

69చూసినవారు
గద్వాల: హైదరాబాద్ కు బయలుదేరిన ఉపాధ్యాయ అభ్యర్థులు
గద్వాల జిల్లాలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ బి. యం సంతోష్ తెలిపారు. బుధవారం ఐ. డి. ఓ. సి ఆవరణలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన 172 ఉపాధ్యాయ అభ్యర్థులలో 141 మంది అభ్యర్థులు హైదరాబాదులో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్