మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పలు అంశాల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కుడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పరిస్థితిని సీఎంకు వివరించారు. అనంతరం కిన్నెర వాయిస్తూ పాట పాడడంతో సీఎం అభినందించారు.