గొర్రెలు మృతి చెందిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

53చూసినవారు
రాష్ట్ర సరిహద్దు రాయచూరు సమీపంలోని ఎర్రమోర్సు ఫ్లై ఓవర్ వద్ద ఉట్కూరు మండలం ఓబ్లాపూర్ గ్రామానికి చెందిన అనంతమ్మ, మల్లేష్, సినప్ప కు చెందిన సుమారు 150 గొర్రెలు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరణించిన గొర్రెలను పరిశీలించారు. తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని యజమానులకు చెప్పారు.

సంబంధిత పోస్ట్