May 10, 2024, 11:05 IST/కల్వకుర్తి
కల్వకుర్తి
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
May 10, 2024, 11:05 IST
కల్వకుర్తి నియోజకవర్గం గ్రామాల అభివృద్ధికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్, ముస్తఫా అన్నారు. శుక్రవారం చారకొండ మండలంలో జూపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారత ప్రధానిని రాహుల్ గాంధీని చేయాలని కోరారు.