భారత పురుషుల క్రికెట్ జట్టు కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ ద్రవిడ్ పదవీ కాలం జూన్తో ముగియనుంది. ఆ స్థానంలో గంభీర్ను బీసీసీఐ పెద్దలు ఎంపిక చేసినట్లు సమాచారం. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మే 27 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. దీనికి భారీగా స్పందన వచ్చింది. చివరికి గంభీర్ వైపు BCCI మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. BCCI నుంచి స్పష్టత రావాల్సి ఉంది.