మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ 14 ఏళ్ల మైనర్ బాలికపై దాటియాకు చెందిన ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికకు మత్తు పదార్థాలు కలిపిన నీళ్లు తాగించిఅత్యాచారం చేశారు.
దీంతో బాధితురాలు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు బాలికతో స్నేహంగా ఉంటూ ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.