గంగవ్వ కేసు.. ఫైన్‌తో సరిపెట్టిన అధికారులు

50చూసినవారు
గంగవ్వ కేసు.. ఫైన్‌తో సరిపెట్టిన అధికారులు
TG: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫైన్‌తోనే అధికారులు సరిపెట్టినట్లు తెలుస్తోంది. పంజరంలో చిలుకను బంధించారని మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ బృందంపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మై విలేజ్ బృందం రూ.25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్ఓ తెలిపారు. దీంతో కేసును ముగించినట్లు పేర్కొన్నారు. అలాగే చిలక జోస్యం వీడియోను తొలగించినట్లు మై విలేజ్ షో సభ్యుడు అనిల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్