బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

61చూసినవారు
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. క్యాంపస్‌లో గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సిబ్బందికి పట్టుబడ్డారు. దీంతో అధికారులు ఆ విద్యార్థులను పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చినట్లు సమాచారం. పటిష్ట భద్రత ఉంటే విద్యా కేంద్రంలో గంజాయి పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్