ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. షాహిద్ అనే వ్యక్తికి 18 ఏళ్ళ కూతురు (సాహ్నుమా) ఉంది. అయితే, తన కూతురు వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతుందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.