కోబ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఛాంపియన్షిప్ చివరి రోజున భారత్ సిమ్రాన్ శర్మ మహిళల 200 మీటర్ల T12 ఈవెంట్లో 24.95 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చెసుకుంది. డొమినికాకు చెందిన డార్లెనిస్ డి లా సెవెరినో (25.08) రజతం, లోరైన్ గోమ్స్ డి అగుయర్ (25.40) కాంస్యం సాధించారు. ప్రస్తుతం భారత్కు 15 పతకాలు (6 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు) లభించి ఆరో స్థానంలో నిలిచింది.