హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాపు యజమానిని దుండగులు బెదిరించారు. యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయింది.