రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

84చూసినవారు
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం పట్టుబడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్