ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఫసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారనుండటం నైరుతి రుతుపవనాలకు అనుకూలమన్నారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్య విస్తార వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. గతేడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు.