అస్సాంలో వరదల ధాటికి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికి లక్షకు పైగా ప్రజలు వరద ముంపులో ఉన్నారు. ఈ క్రమంలో జోర్హాట్లోని నిమతిఘాట్ వద్ద తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ మునిగిపోతుంటే, ఇద్దరు వ్యక్తులు ప్రాణభయంతో కేకలు పెట్టారు. SDRF, అగ్నిమాపక శాఖ అధికారులు సాహసోపేత ప్రయత్నంలో వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.