ఐపీఎల్-2024 లో ఇవాళ చెన్నైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజారాజ్ నిర్ణీత ఓవర్లలో 231 రన్స్ చేసింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56 ), ధోనీ(26) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, రషీద్ 2 వికెట్లు తీశారు.