దేశంలో లోక్సభ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ఎండ నుంచి ఉపశమనం కోసం తిరుపత్తూరు జిల్లాలోని పోలింగ్ బూత్ ఎదుట కొబ్బరి, వెదురు, అరటి ఆకులతో పందిరి వేసి అందంగా ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.