వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్-2024కి గుజరాత్ రాజధాని గాంధీనగర్ ముస్తాబైంది. సదస్సుకు హాజరయ్యే అతిథులకు కనులవిందు అనిపించేలా రాష్ట్రప్రభుత్వం గాంధీనగర్ను సిద్ధం చేసింది. సిటీ మొత్తం లైట్ల వెలుగులతో ధగధగలాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తన వ్యక్తిగత X ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.