భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరమన్నారు.