ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల చర్యలతో ప్రస్తుతం నక్సలిజం చిన్న ప్రాంతానికి పరిమితమైందన్నారు. ఛత్తీస్గఢ్ సహా యావత్ దేశం నుంచి త్వరలోనే మావోయిస్టులు కనుమరుగవుతారని చెప్పారు.