రూ. 15 లక్షల 50 వేలతో ఉడాయించిన బ్యాంక్ అధికారి

590చూసినవారు
రూ. 15 లక్షల 50 వేలతో ఉడాయించిన బ్యాంక్ అధికారి
పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు ఓ అధికారి. ఈ ఘటన వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్ లో జరగ్గా.. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్బీఐ వలిగొండ బ్రాంచ్ లో కాలేరు అనిల్ కుమార్ క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులకు హాజరైన అనిల్.. కొద్దిసేపు విధులు నిర్వహించి రూ.15.50 లక్షల నగదును కాజేసి ఉడాయించాడు. బ్యాంక్ మేనేజర్ మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్