భోజనంలో వెంట్రుక.. మహిళా ఎంపీ ఆగ్రహం

2890చూసినవారు
భోజనంలో వెంట్రుక.. మహిళా ఎంపీ ఆగ్రహం
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకు అందించిన ఆహారంలో వెంట్రుకలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఎంపీ ఎయిర్ లైన్స్ తీరును తప్పుబట్టారు. ఎట్టకేలకు స్పందించిన ఎమిరేట్స్ క్షమాపణలు చెప్పింది. ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపింది.