ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు సంచలన ఆదేశాలచ్చింది. దాడి కేసు నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ను ఈరోజు సాయంత్రంలోగా సీబీఐకి అప్పగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. షాజహాన్ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు.