హోలీ వేడుకల్లో అపశృతి.. మంచినీటి ట్యాంకు కూలి చిన్నారి మృతి

566చూసినవారు
హోలీ వేడుకల్లో అపశృతి.. మంచినీటి ట్యాంకు కూలి చిన్నారి మృతి
హోలీ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణపేట పట్టణం గోపాల్‌పేట వీధిలో ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కూలింది. దీంతో ట్యాంకు సిమెంట్ ముక్కలు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చిన్నారులను జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు ప్రణీత, హరిప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్