‘వైజయంతీ మూవీస్’ బ్యానర్లో ఎన్నో హిట్ చిత్రాలను అశ్వనీదత్ తెరకెక్కించారు. కాగా.. ఈ సంస్థకు ఆ పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. అశ్వనీదత్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలి సినిమా ‘ఎదురులేని మనిషి’ ప్రారంభమైంది. కాల్షీటుపై సంతకం పెడుతూ, ‘సంస్థకేం పేరు పెట్టారు’అని ఎన్టీఆర్ అడగగా..మీరే చెప్పండి అని దత్ అన్నారు. కృష్ణుడి మెడలో ఉన్న వైజయంతిమాలకు గుర్తుగా ‘వైజయంతీ మూవీస్’అని ఎన్టీఆర్ పేరు పెట్టారు.