వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని అడ్మిన్ను ఓ వ్యక్తి కిరాతకంగా వెంటాడి కాల్చి చంపేసిన దారుణ ఘటన పాకిస్థాన్లోని పెషావర్లో జరిగింది. ముష్తాక్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్కు అడ్మిన్గా ఉన్నాడు. అష్ఫాక్ను వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని కక్ష్య పెంచుకున్నాడు. పక్కా ప్లాన్తో హత్య చేశాడు. అయితే, ఢిల్లీలో కూడా ఇలాంటి హత్య 2023లో జరిగింది. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని అడ్మిన్పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు.