ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్పై గురువారం కోర్టు విచారణ జరుపనుంది. రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదని పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.