పశ్చిమ బెంగాల్ లోని రాణిగంజ్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ జ్యువెలరీ షాపులో పట్టపగలు చోరీకి చేయడానికి ఏడుగురు దొంగలు చొరపడ్డారు. అదే సమయంలో పర్సనల్ పని మీద అటువైపు వెళ్తున్న ఎస్ఐ మేఘనాథ్ మోండల్.. దొంగలను గమనించి ఫుల్ డేరింగ్ తో కాల్పులు జరిపాడు. ఆయన దెబ్బకి బెదిరిపోయిన దొంగలు సగం సొమ్ము అక్కడే వదిలేసి పారిపోయారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది.