భారీ వర్షం.. కొట్టుకుపోయిన 300 క్వింటాళ్ల ధాన్యం

38958చూసినవారు
భారీ వర్షం.. కొట్టుకుపోయిన 300 క్వింటాళ్ల ధాన్యం
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షం దాటికి వరంగల్‌ జిల్లా తిమ్మాపూర్‌లో బీజేపీ సభా వేదిక కూలడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. కరీంనగర్ SRR గ్రౌండ్ లో ఇవాళ కాంగ్రెస్ సభ ఉండగా.. టెంట్లు కుప్పకూలాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షం పడింది. దీంతో అక్కడి వ్యవసాయ మార్కెట్‌లో 300 క్వింటాళ్ల ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. మార్కెట్‌లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల నానా అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్