హైదరాబాద్ తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. HYD నగరంలో భారీ వర్షం పడుతున్నా.. అధికారులతో చర్చించడానికి సచివాలయానికి వెళ్లి పర్యవేక్షించారు.